Tuesday, February 18, 2020

Mass Mallanna Ground Report From Amaravati | అమరావతి నుండి మాస్ మల్లన్న గ్రౌండ్ రిపోర్ట్ | అమరావతి అంతా గ్రాఫిక్స్ అన్న వాళ్ళ చెంప చెళ్లుమనిపించిన మాస్ మల్లన్న

Mass Mallanna Ground Report From Amaravati | అమరావతి నుండి మాస్ మల్లన్న గ్రౌండ్ రిపోర్ట్ | అమరావతి అంతా గ్రాఫిక్స్ అన్న వాళ్ళ చెంప చెళ్లుమనిపించిన మాస్ మల్లన్న
Mass Mallanna Ground Report From Amaravati

38 comments:

  1. అమరావతి గ్రాఫిక్స్, భ్రమరావతి, చంద్రబాబు మాయ అంటూ మాయకబుర్లు చెప్పిన వైసీపీ వాళ్లు కాదు... వాటిని నమ్మిన ఆంధ్రా ప్రజలే సన్నాసులు, దుర్మార్గులు

    ReplyDelete
  2. పైకెక్కి అక్కడ నుండి కిందకు దూకితే గ్రాఫిక్సా, నిజం కట్టడాలా అన్న సందేహం తీరిపోతుంది కదా అని మాస్ మల్లన్న భలే అన్నాడు 👌🙂.

    ReplyDelete
  3. దూకడమెందుకు? గ్రాఫిక్స్ అన్నవాడిని పైనుంచి తోసేస్తే పోలా?

    ReplyDelete
    Replies
    1. అలా అయితే ముందు రోజాను తోసేయాలి.

      Delete
  4. ఉన్నయని బోకుజ్యొతీ, లేవని కుక్షీ... దరువులేసుకోవడం తప్ప, ఎవ్వడూ క్షేత్రస్థాయికెల్లి ప్రూఫులు పెట్టరు

    ReplyDelete
  5. పై విడియోలో మాస్ మల్లన్న చూపించింది క్షేత్రస్ధాయి ప్రూఫులేగా మరి.

    ReplyDelete
  6. బాహుబలి గ్రాఫిక్స్ ఉత్తుత్తి ఇడ్లీ ప్లేట్ బూచి భవంతులు అసాధ్యమని తెలుసుకొని నాలుగు సాధారణ భవనాలు కట్టించాడు బాబు.

    33000 ఎకరాలు బంగారు పంటలు పండే భూములు తీసుకొని అలవికాని చోట మాయాబజార్ తలపెట్టడం తప్పు.

    ఏర్పడిన కొన్ని భవనాలు పరిపాలనకు సరిపోతాయి. ఇప్పుడు రాజధాని మార్పు చేయడం సరికాదు.

    నేను జగన్ అభిమాని నే అయినా రాజధాని విషయం లో సమర్థించ లేను.

    గుంటూరు విజయ వాడ నడుమ ఒక వేయి ఎకరాలు మాత్రమే సేకరించి పాలనా రాజధాని నిర్మించి ఉంటే బాగుండేదేమో.



    ReplyDelete
    Replies
    1. "బాహుబలి గ్రాఫిక్స్ ఉత్తుత్తి ఇడ్లీ ప్లేట్ బూచి భవంతులు అసాధ్యమని తెలుసుకొని నాలుగు సాధారణ భవనాలు కట్టించాడు బాబు."
      "33000 ఎకరాలు బంగారు పంటలు పండే భూములు తీసుకొని అలవికాని చోట మాయాబజార్ తలపెట్టడం తప్పు."
      పై మీ ఉద్దేశ్యం తప్పుగా అనిపిస్తోంది GKK (జీ)గారు. అక్కడ కేవలం నాలుగు సాధారణ బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయని నమ్మడమేనా? లేక పోయి చూసివచ్చిందేమన్నా ఉన్నదా?
      రాజధానంటే విశాలమైన రోడ్లు, భవంతులతో ప్రారంభమయ్యి ఒక్కొకటి స్థాపితమవుతూ వస్తాయి. దానికి కనీసం 15 నుండి 20 సవంత్సరాల వరకు పట్టవచ్చు. రాజధానంటే క్రమేపీ అభివృద్ధి అవుతూ రావాలి. ముందు పరిపాలనా రంగం రావాలి. వారికి అన్నీ వసతులూ ఏర్పాటు చేయాలి. ఆ తరువాత మిగతా రంగాలను స్థాపించే పనులు చేయాలి. చంద్రబాబుగారి పని విలువ పూర్తిగా అర్ధం చేసుకోకుండా గ్రాఫిక్స్, బొమ్మలు అంటూ నిందిస్తే ఎలా?

      ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్న జగన్ గవర్నమెంట్ చంద్రబాబు వేసిన రోడ్లు మీద తిరుగుతూ, చంద్రబాబు కట్టిన కొంపల్లోనే ప్రభుత్వ కాపురాలు చేస్తున్నారు. ఇవన్నీ గ్రాఫిక్స్ అయితే వాళ్లెలా కార్యాలయాలు నడుపుతున్నారో చెప్పాలి.
      అసలు గ్రాఫిక్స్ సూత్రధారులు చంద్రబాబా లేక జగన్ అండకో పార్టీనా అన్నది తొమ్మిది నెలల పాలనలో ఆంధ్రా ప్రజానీకానికి అర్ధం అయ్యింది.

      Delete
    2. మీరు మాత్రం వెళ్లి చూసొచ్చారా మిత్రమా?

      నవనగరాలు, ఐకానిక్ టవర్స్, వాటర్ ఫ్రంట్ అంటూ ఐదేండ్లు కులమీడియా ఊదరగొట్టిన భ్రమరావతి గ్రాఫిక్కులకు ఇప్పుడు "రియాలిటీ షో"లో చూపిస్తున్న నాలుగు అపార్ట్మెంట్ బిల్డింగులకు తేడా నక్కకు నాగలోకానికి ఉన్నంత కాదా. హుజూర్ నగర్ ఉప-ఎన్నికలలో మరీ చావు దెబ్బ తిన్నాక తీన్మార్ మల్లన్న మైండ్ పూర్తిగా దొబ్బినట్లుంది.

      వాటి నాణ్యత ఎట్లా ఏడిచిందో లీకులు చూస్తే తెలిసింది వేరే విషయం కానీ రోడ్లు బిల్డింగులు వగైరాలు చంద్రబాబు బాబుగాడి సొమ్ముతో కట్టినవి కావు. మంది డబ్బుతో కట్టినవి వాడడానికి రాయల్టీ అడగడానికి తెగులు తమ్ముళ్లకు నోరెలా వచ్చిందో ఏమో.

      Delete
    3. తప్పుడు మాటలు మాట్లాడకు మిత్రమా?

      చంద్రబాబు మీ తెలంగాణ మోసగాళ్ళకే కాదు ఉమ్మడి ఆంధ్రాకు ముఖ్యమంత్రిగా రెండుసార్లు, విడిపోయిన ఆంధ్రాకు ఒకసారి ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి. గౌరవంగా మాట్లాడండి జైగారు..

      చంద్రబాబు కట్టాడు అంటే అర్ధం తన హయాంలో కట్టినవి అని అర్ధం చేసుకోవాలి. జగన్ ఎలక్షన్ కు ముందు ఎన్ని లక్షలయినా ఇచ్చేస్తా అని మాట్లాడేవాడు. ఇక్కడ ఇస్తాను అంటే తనదో, తన బాబుదో ఇస్తాడని కాదు. మంది డబ్బే పంచి పెడతాడని అర్ధం. ఈమాత్రం కూడా తెలియడం లేదు గాని ఆంధ్రా మీదా పచ్చి ద్వేషంతో విషం కక్కుతున్నారు.

      ఆంధ్రా ఆస్తులన్నీ దోచుకుతిన్న మీ కేసీయార్ అండ్ బ్యాచ్చికి కొవ్వు ఎక్కువై ఎమ్మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు.

      లీకులకు మీరు తడిచిపోయినట్టు మాట్లాడుతున్నారు. మీరు చూసారా? జబర్దస్త్ రోజా మాటలు వినడం మానండి ముందు. అమరావతి విజిట్ చేశాము కాబట్టే దానిని అభివృద్ధి చేస్తే ఆంధ్రా ఎంత బాగుపడుతుందో తెలుసుకున్నాము కాబట్టే మేము గోల పెడుతున్నాము. ఎక్కడో తెలంగాణాలో కూర్చుని కబుర్లు చెప్పడం మానండి.

      Delete
    4. @Jai GottimukkalaFebruary 20, 2020 at 2:12 PM
      మీరు మాత్రం వెళ్లి చూసొచ్చారా మిత్రమా?

      నవనగరాలు, ఐకానిక్ టవర్స్, వాటర్ ఫ్రంట్ అంటూ ఐదేండ్లు కులమీడియా ఊదరగొట్టిన భ్రమరావతి గ్రాఫిక్కులకు ఇప్పుడు "రియాలిటీ షో"లో చూపిస్తున్న నాలుగు అపార్ట్మెంట్ బిల్డింగులకు తేడా నక్కకు నాగలోకానికి ఉన్నంత కాదా.

      hari.S.babu
      చంద్రబాబు అసలేం కట్టలేదనీ గ్రాఫిక్స్ చూపించి మోసం చేస్తున్నాడని వాగేవాళ్ళకి కళ్ళు పోయాయో మైండు చెడిందో నాకు అర్ధం కావడం లేదు.ఏప్రిల్ 2016 నాటికి చంద్రబాబు అమరావతి పక్కనున్న వెలగపూడి నుంచే పరిపాలన మొదలుపెట్టాడు.మార్చి ఇరవయ్యేడుకల్లా లెజిస్లేచర్ అసెంబ్లీ భవనం పూర్తయ్యింది.అక్టోబరు నాటికి ఉన్నతాధికారులు తమ తమ శాఖలలో కూర్చుని కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు.కేవలం ఒక్క సంవత్సరంలోనే ముఖ్యమంత్రీ ఇతర మంత్రులూ, నిక్కచ్చిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భౌతికపరమైన శరీరం అనదగ్గ అన్ని మంత్రిత్వ శాఖలూ వెలగపూడిలో కనిపిస్తున్నాయి.అప్పటికే హైకోర్టు నిర్మాణం కూడా పూర్తయ్యింది.అయితే ఇది ప్రపంచస్థాయి రాజధాని కాదు కదా, ఈ తాత్కాలిక నిర్మాణాలని చూపిచటం మోసం చెయ్యటమే కదా అనేవాళ్ళకి ఒకటే జవాబు - ఒక మధ్యతరగతి కుటుంబీకుడు రిటైరయ్యాక తన కలల భవంతిని నిర్మించుకోవాలంటే శంఖుస్థాపాన చేసిన వెంటనే గృహ ప్రవేశం చెయ్యలేడు కదా, మరి ఆలోపు అతను ఆరుబయట ఉండలేడు కదా, తను కట్టుకోబోయే ఇంటికి దగ్గిర్లో ఒక అద్దె ఇంటిని తీసుకుని సర్దుకుపోవడం లేదా!

      ఈ తాత్కాలిక నిర్మాణాలను ఇలా ఉంచితే అసలైన రాజధానిని నిర్మించడానికి ascendas అనే సింగపూర్ సంస్థకి అప్పగించారు.ఇది అర్బన్ డెవలప్మెంట్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న సంస్థ.ఆరు నుంచి ఏడు సంవత్సరాలలో పూర్తి స్థాయి అమరావతి నగర నిర్మాణం కోసం టార్గెట్ పెట్టారు.ఆలస్యం జరిగితే కంపెనీ మనకి నష్టపరిహారం ఇచ్చే క్లాజు కూడా చేర్చారు.వీళ్ళు వచ్చి నిర్మాణాలు మొదలుపెట్టారు.చాలా వేగంగానే పనిచేస్తున్నారు.అమరావతి అనే ప్రాజెక్టు విలుబ్వ 33,000 కోట్లు.HUDCO సంస్థ 7500 కోట్లు పెట్టుబడి పెట్టింది.ప్రపంచ బ్యాంకు కూడా అత్న వంతు సహాయం కింద 300 మిలియన్ USD పెట్టుబడి పెట్టింది.కేంద్రం కూడా ముందుకు వచ్చి 2500 కోట్ల వరకు నిధులు కేటాయించింది, అందులో 1500 కోట్లు గ్రాంటు కింద విడుదల కూడా చేసింది.ఇక రాష్ట్రప్రభుత్వం తన వంతు 500 కోట్లను ఇందులో పెట్టింది.ఇది జమాఖర్చుల వివరం అయితే ఆకారం ఎలా ఉంటుందో చూస్తే ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఇంత అద్భుతమైన రాజధాని నగరం ఇంకెక్కడా లేదనిపించేటట్టు ప్లాన్ చేశారు.అమరావతి అనేది ఒక నగరం కాదు, తొమ్మిది నగరాలతో కూడిన మహేంద్రనగరం!

      ఇప్పటివరకు రాజధానులను నిర్మించినవారిలో ఎవరికీ ఇలాంటి వూహయే రాలేదంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు - పూర్తయిన అమరావతిలో నివసించడానికి ఎంతో అదృష్టం కావాలని అనిపిస్తుంది ఇందులో ఇమిడ్చిన అంశాలను చూస్తే!పొరుగువాళ్ళ ఈర్ష్యాదృష్టులు తగిలి ఆ అదృష్టం ఆంధ్రులకు లేకనే చంద్రబాబు వోడిపోయి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడేమో అనిపిస్తున్నది నాకు!

      Delete
    5. కేవలం ప్రభుత్వ భవనాలు మాత్రమే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ బ్రాంచీల్ని ఇక్కడ తెరిచాయి.వీటిలో ప్రముఖమైన వాటిని మాత్రమే నేను చెప్తున్నాను.మొత్తం చెప్పాలంటే చాలా చెప్పాల్సి వస్తుంది.Pi Data centre - ఇది ఆయియా ఖండంలోనే నాల్గవ ర్యాంకులో ఉన్న అతి పెద్ద ఫెసిలిటీ సెంటర్ - ఆమ్రావతిలో తమ సంస్థను పెట్టడానికి వాళ్ళు 600 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధపడ్డారు!HCL - భారతదేశంలో అతి పెద్ద కంప్యూటర్ సంబంధిత సేవలు అందిస్తున్న కంపెనీ - అమరావతిలో క్యాంపస్ పెట్టడానికి భూమిని కొన్నారు!BRS Medicity - 1.8 మిలియన్ డాలర్లు అమరావతిలో తమ సంస్థను పెట్టడానికి కేటాయించుకున్నారు, ప్రభుత్వం స్థలం ఇచ్చింది, పనులు చేస్తూ కొనసాగుతున్నారు!

      ఇదీ గత అయిదేళ్ళలో ప్రపంచ స్థాయి గల ప్రముఖ వాణిజ్య సంస్థలు అమరావతిని ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని అని గురించి చూపిస్తున్న నమ్మకంతో కూడిన అభిమానం. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునుంచీ ఇలాంటి కంపెనీల్ని మళ్ళీ రమ్మన్నా రాకుండా పొయ్యేలా తరిమి తరిమి కొట్టి ఇవ్వాళ, అంటే నిన్ననో మొన్ననో ఇప్పటి ప్రభుత్వంలోని మంత్రి ఒకరు ఇకముందు పెట్టుబడులను తెచ్చే ప్రయత్నాలను మొదలు పెడతామని అంటున్నారు- మూడు సౌదీ అరేబియా కంపెనీలు వస్తామని అన్నాయట!ఆ సౌదీ అరేబియా చరిత్ర చూస్తే అప్పుడెప్పుడో ఆయిల్ విపరీతంగా తవ్వి చవగ్గా అమ్మి మార్కెట్ సంక్షోభాన్ని సృష్టించి అందరూ కలిసి మార్టోరియం విధిస్తే వెనక్కి తగ్గి ఇప్పుడు అప్పుల కోసం దేశదేశాలు తిరుగుతున్నది. అక్కడి జనాలకి ఆయిల్ బావులు తవ్వటమూ మక్కా యాత్రికులకి సౌకర్యాలు చెయ్యటమూ తప్ప ఇంకేం తెలీదు - అలా ఉంది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఉద్యోగ కల్పన స్థాయి.

      చంద్రబాబు హయాంలోనే SRM University, VIT AP,AMITY UNiversity,Amriita University వంటి ప్రముఖ విద్యాసంస్థలు వచ్చాయి,స్థలాలు కొనుక్కున్నాయి, భవనాలు కట్టుకున్నాయి, పిల్లలకు పాఠాలు చెప్పడం కూడా మొదలుపెట్టాయి.ఇంక అమరావతి అనంతపూర్ హైవే, దీన్ని క్రాస్ చేస్తూ కడప కర్నూలును కలుపుతూ వెళ్ళే ఫీడర్ వే - విల్లునుంచి ఎక్కుపెట్టిన బాణంలా ఉండి 16వ జాతీయ రహదారితో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ నగరాలను కలిపేస్తున్న పనులు మొదలయ్యాయి.ఇది హైదరబాదులోని ఔటర్ రింగు రోడ్డుకి బాబు లాంటిది! ఇప్పుడు అమరావతి విషయంలో తెదెపా వాళకి అంటగడుతున్న ఇన్సైడర్ ట్రేడింగ్ రాజశేఖర రెడ్డి అధ్వర్యంలో ఔటర్ రింగు రోడ్డు సమయంలోనే జరిగింది.ఇప్పుడు అది నగరానికీ ప్రజలకీ ఊయోగపడటం మంచిదే గానీ దాని రూపకల్పన మాత్రం కాంగ్రెసువాళ్ళ సొంతలాభం కోసమే జరిగింది. అప్పట్లో అక్కడ ఉన్న భూములన్నీ కాంగ్రెసువాళ్ళవే.ఆ ప్లాను వల్ల వాళ్ళు రెండు విధాల లాభపడ్డారు.కొందరు నిర్మాణం కోసం భూములు ఇచ్చి ప్రభుత్వంతో ఎక్కువ రేటు వేయించుకుంటే మరి కొందరు ఇతర్లకి అమ్ముకున్నారు. ఇప్పుడు అతని కొడుకు మొన్నటి ఎన్నికలకి ముందు ఇప్పుడు మీరు ఎంత ఖర్చు పెడితే మనం అధికారంలోకి వచ్చాక అంతకి నాలుగింతలు మీకు సంపాదించి పెడతాను అని తను చేసిన వాగ్దానం మేరకే రాజధానిని విశాఖకి మార్చడమనే ప్లాను వేశాడు.

      Delete
    6. ముందెప్పుడో "అభివృద్ధి" జరుగుతుందన్న (ప్రజలచే తిరస్కరించబడిన) పుక్కిటి పురాణాన్ని వదిలేసి, సదరు అద్దాల మేడ ప్రస్తుత స్థితిగతులు చూడండి. మీరు వెళ్లొచ్చారు(ట) కాబట్టి plan vs. actuals చెప్పండి తప్ప as-built చూపించడం సమీక్ష కానేరదు.

      A status review is meaningful only if you compare the present position with the original plan. మీరు చూపిస్తున్న మూడు నాలుగు అపార్టుమెంట్లు ఐదేండ్ల భ్రమరావతి నవనగరాల ప్రచార వీడియోలో బిగించి (superimpose) చూసుకుంటే డొల్లతనం ఎవరికయినా తెలుస్తుంది.

      అసెంబ్లీలో లీకుల గురించి అప్పటి స్పీకర్ సైతం నిండు సభలో మాట్లాడాడు. సదరు సమావేశాన్ని CBN చంద్రజ్యోతి లైవ్ ప్రచా(సా)రం చేసింది కూడా.

      చంద్రబాబు "నేను కట్టిన రోడ్లలో తిరిగే అలగా కులం తక్కువ వెధవలారా, సైకిల్లుకు ఓటేసి నా ఋణం తీర్చుకోండి" అనే అర్ధం వచ్చేట్టు ప్రచారం చేసినందుకే జనం (ఆంధ్ర జనమే లెండి, తెలంగాణోళ్ల గురించి కాదు) చావు దెబ్బలు కొట్టారు. ఇప్పటికీ సోయి రాకపోతే ఎట్లనండీ?

      Delete
    7. "గొట్టి ముక్కల గారు ఆంధ్రుల పట్ల, ఆంధ్రుల రాజధాని అమరావతి పట్ల, చంద్రబాబు పట్ల నరనరాన ద్వేషంతో ఎలా ఉన్నాడో చూసారా? ఈయన అమరావతిని ఏమాత్రం ఒప్పుకోవడం లేదు అచ్చం కేసీయార్లా! అవును ఇంతకీ ఈయన కూడా తెలంగాణ స్వార్ధపరుడే కదా!!

      Delete
    8. ఇప్పటివరకు రాజధానులను నిర్మించినవారిలో ఎవరికీ ఇలాంటి వూహయే రాలేదంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు - పూర్తయిన అమరావతిలో నివసించడానికి ఎంతో అదృష్టం కావాలని అనిపిస్తుంది ఇందులో ఇమిడ్చిన అంశాలను చూస్తే!పొరుగువాళ్ళ ఈర్ష్యాదృష్టులు తగిలి ఆ అదృష్టం ఆంధ్రులకు లేకనే చంద్రబాబు వోడిపోయి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడేమో అనిపిస్తున్నది నాకు!

      Delete
    9. @Jai GottimukkalaFebruary 20, 2020 at 4:07 PM
      ముందెప్పుడో "అభివృద్ధి" జరుగుతుందన్న (ప్రజలచే తిరస్కరించబడిన)

      hari.S.babu
      what you tell about jagan's defeat in 2014.We know fully about your neech kameen jaundice toungue.aamraavati wil raise again.Do not undersetimate andhras!

      CBN had so many defeats by filthy gangsters and raised back.One defeat for a warrior is not the end.But your hero jagan will soon be imprisoned out of country!

      Delete
    10. పొరుగువాళ్ళ ఈర్ష్యాదృష్టులు తగిలి ఆ అదృష్టం ఆంధ్రులకు లేకనే చంద్రబాబు వోడిపోయి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడేమో అనిపిస్తున్నది నాకు!

      Delete
    11. This comment has been removed by the author.

      Delete
    12. @AP PoliticsFebruary 20, 2020 at 5:51 PM
      అవును ఇంతకీ ఈయన కూడా తెలంగాణ స్వార్ధపరుడే కదా!!

      hari.S.babu
      తెలంగాణా అంటే పెద్ద అభిమానం కూడా లేదు.అదో పిచ్చ, అంతే!

      జైలాంటివాళ్ళు తమ తమ సబ్జెక్టులలో అఖండులై వుండి చుట్టూ జరుగు తున్న రాజకీయాలు తెలియకపోవడం వల్ల గానీ తెలిసే తమను పురమాయించిన వాళ్ళు చెప్పే చిలక పలుకులు పలుకుతున్నారో గానీ "చంద్రబాబు అభివృద్ధి మొత్తాన్ని ఒక్క హైదరాబాదులోనే కేంద్రీకరించడం వల్లనే రాష్ట్రం విడిపోయింది!" అనే చెత్తమాటని పదే పదే వాడుతున్నారు, మరి ఇప్పటికీ కేసీయారు హైదరాబాదుని అట్లాగే ఉంచేశాడు, ఏం అతనికి మరోసారి తెలంగాణ విడిపోతుందనే భయం లేదా? భవిష్యత్తులోనైనా అక్కడ వేర్పాటు ఉద్యమాలు పుట్టే అవకాశం ఉందా? లేనే లేదు - అది ప్రతి ఒక్కడికీ తెలుసు!

      విభజనకు సంబంధించిన సమస్తమయిన పాపాల్నీ చంద్రబాబు మీదకి తోసెయ్యడానికి కేసీయారు వాగిన చెత్త వాగుడు తప్ప విభజనకీ హైదరాబాదు అభివృద్ధి చెయ్యటానికీ ఎలాంటి సంబంధమూ లేదు. 1962లోనూ 1969లోనూ తెలంగాణ వైపునుంచి ప్రత్యక తెలంగాణ వాదనలూ 1972లో ఆంధ్ర వైపు నుంచి జై ఆంధ్ర వాదనా వొచ్చినప్పుడు హైదరాబాదు ఇప్పటిలా లేదు కదా!ఆ రెండు సార్లూ తెలంగాణ వాళ్ళు తమకు జరుగుతున్న అన్యాయాలతో మెలికపెట్టి ప్రత్యేక రాష్ట్రం అడిగారు, కేంద్రం ఆ అన్యాయాల్ని పరిష్కరించడంతో చల్లబడ్డారు.కానీ, ఇప్పుడు కూడా సమస్యల్ని బట్టి అడిగితే మళ్ళీ సమస్యల్ని పరిష్కరించితే చల్లారిపొతుందని తెలిసి ఆదినుంచీ సమస్యలను కేంద్రం చెయ్యకుండా జాగ్రత్త పడ్డారు, "ఆంధ్రా దోపిడీ!", "ఆంధ్రోళ్ళ పెత్తనం!" అనే పదాలతో ఈ ప్రాంతాన్నీ ఈ ప్రాంతపు వ్యక్తుల్నీ టార్గెట్ చేసి విజయవంతంగా విడిపోవటానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు కూడగట్టగలిగారు.

      మొన్నటి తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన ఉద్యమం రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమత్రిగా ఉన్న చంద్రబాబును పడగొట్టటానికి వూపిరి పోసినది గనక చాలా సహజంగా చంద్రబాబును విలన్ని చెయ్యాల్సిన అవసరం వాళ్ళకి వుంది. జైలాంటివాళ్ళకి అవినీతిపరుల్ని అభిమానిస్తూ నిజాయితీ పరుల్ని అసహ్యించుకునే మానసిక రోగం ఉంది.2014 నుంచి 2019 మధ్యకాలంలో దేశంలోకల్లా అధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఆంధ్ర మూడో స్థానంలో ఉందనీ ఇక ఆఖరు సంవత్సరంలో ఎక్కువ పెట్టుబడులు ఆంధ్రకే వచ్చాయని చెప్పిన రిజర్వ్ బ్యాంకు చంద్రబాబు జేబు సంస్థ కాదు గదా - ఆ తేదీలనూ ఆ మూడో స్థానాన్నీ అబద్ధం అనగలడా?

      అనలేడు!ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తమ అధికారం చూసుకుని గర్వంతోనో తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికో అట్లా అబద్ధాలు చెప్తున్నారని అనుకోవచ్చు, కానీ ఆ పరిపాలకులు అబద్ధాలు చెప్పి తమని మోసం చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళనే అభిమానించే తెలివితక్కువ వోటర్లని ఎట్లా అర్ధం చేసుకోవాలి?గత ప్రభుత్వం పెంచింది కాబట్టి అంగన్ వాడీ కార్యకర్తల జీతాల్ని కూడా వెనక్కి లాక్కుంటున్న నికృష్టపు ప్రభుత్వాన్ని ఎలా సమర్ధించగలుగుతున్నాడో?


      సీబీఐ ప్రభుత్వ సంస్థయే గాబట్టి ఈ కేసుల వల్ల ఏమీ కాదు గానీ రస్ అల్ ఖైమా మాత్రం వదిలే ప్రసక్తి లేదు - కొద్ది రోజుల్లోనే పిలుపు రాక తప్పదు, వస్తే వెళ్ళకా తప్పదు!ఈ ముఖ్యమంత్రికి కనీసపు కామన్ సెన్స్ ఉండి ఇంత విధ్వంసం చెయ్యకుండా అద్భుతాలు సృష్టించనక్కర లేదు, కనీసం గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కొనసాగించి వుంటే ప్రజలు ముఖ్యమంత్రి తరపున నిలబడి పోరాడి తాము గెలిచి అతన్ని గెలిపించి అన్ని కేసుల నుంచీ బయటికి తీసుకొచ్చి వుండేవాళ్ళు!ఇప్పటికైనా ప్రజల్ని హిసించటం ఆపితే ప్రజల నుంచి వచ్చే సహకారంతో అన్ని కేసుల నుంచీ బయట పడవచ్చు.కానీ, కేవలం ఉద్యోగి అయిన DSP శ్రీనివాస్ రెడ్డి "లంజకొడకా!నీ వల్లనే ఇదంతా జరుగుతున్నది.నిన్ను లోపలేస్తే సరిపోతుంది" ,"చంద్రబాబు తెలివిగలోడు.నిన్ను అడ్డుపెట్టుకుని జేఏసీ నడిపిస్తున్నాడు.ఎస్సీ అయి బతికిపోయావు...లంజకొడకా!"అని బూతులు తిట్టే మనస్తత్వంలో ఉంటే వీళ్ళందర్నీ పురమాయించిన ముఖ్యమంత్రికి మారుమనస్సు వస్తుందా!

      ప్రజలకి న్యాయం చెయ్యటం అంటే తనకి వోట్లు వెయ్యరని తను అనుకున్న వాళ్ళ నుంచి భూముల్నీ ఆస్తుల్నీ లాక్కుని తనకి వోట్లు వేస్తారని అనుకున్నవాళ్ళకి పంచిపెట్టటమా!ఏమిటీ ప్రభుత్వం తీరు?ఎందుకీ రాక్షసత్వం!ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రజల మీద యుద్ధం చేస్తున్నదా?

      వాళ్ళు యుద్ధం కోసమే తహతహలాడుతుంటే ప్రజలూ యుద్ధం చేస్తే పోలా!

      Delete
  7. మొన్న ఫిబ్రవరి 13న HCL, తన విజయవాడ కేంపస్ ని ప్రారంభించింది.

    ReplyDelete
    Replies
    1. శుభం, చాలా సంతోషం కాకపోతే మేధా ఐటీ పార్క్ ఉన్నది ఆల్మోస్ట్ గన్నవరంలో.

      బెజవాడ పెద్ద నగరం, ఇతరత్రా అనుకూలతలు ఉన్నాయి కనుక రాజధాని తుళ్ళూరులో ఉన్నా లేకున్నా ఆ వచ్చే పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బంది లేదు.

      కొడాలి నాని శివ నాదార్ గారిని బెదిరించారని, అంచేత వాళ్ళు వేరే రాష్ట్రానికి తరలిస్తారని వగైరా గాలి పుకార్ల భోగట్టా రాయిటర్స్ సంస్థ ఎప్పుడు ఇస్తుందో వేచి చూద్దాం,. అసలే మోడీ, కెసిఆర్, ప్రశాంత్ కిషోర్ గట్రాలు కూడబలుక్కొని గోతి కాడ నక్కలోలె ఆంధ్రులను ముంచేద్దామని కాచుకూచున్నారు(ట). మోడీ అమెరికా తానా తందానా సంఘం భరతం పట్టేందుకు ఖేం చో ట్రంప్ భాయి అంటూ పలకరించి మరీ హెచ్-1 బీ వీసాలను కోస్తాడట కూడాను.

      Delete
  8. అమరావతిలో కూడ మరో కేంపస్ నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు అది ఉండదు.

    ReplyDelete
    Replies
    1. అక్కడ కాకపోతే ఇంకోచోట (విశాఖ?) పెడతారండీ. పెట్టుబడిదారులకు కావాల్సినవి వసతులు, రాయితీలు లాంటివే తప్ప రాజధాని కాదు. The point is that the investments flow is *totally* unrelated to the location of capital.

      Delete
    2. @Jai GottimukkalaFebruary 21, 2020 at 11:17 AM
      అక్కడ కాకపోతే ఇంకోచోట (విశాఖ?) పెడతారండీ. పెట్టుబడిదారులకు కావాల్సినవి వసతులు, రాయితీలు లాంటివే తప్ప రాజధాని కాదు. The point is that the investments flow is *totally* unrelated to the location of capital.
      hari.S.babu
      అరాచకాలు సృష్టించటం అధికారాన్ని కోల్పోయిన వాళ్ళు చేస్తే అర్ధం చేసుకోవచ్చ్గు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అరాచకాలను సృష్టిస్తున్నది.ఎందుకు?పరిపాలన చేత కాక!ఎన్నికలకి ముందరి ప్రభుత్వం కరెంటు కోతలు లేకుండా విదుచ్చక్తి సరఫరాను అత్యద్భుతమైన రీతిలో తీర్చిదిదితే దాన్ని తనే భ్రష్టు పట్టించి మళ్ళీ వచ్చే అయిదేళ్ళలో దాన్ని చక్కదిద్దాలని ప్రభుత్వాధికారులకు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు ప్రస్తుత ముఖ్యమంత్రి - ఇంతకన్న అసమర్ధ పాలన ఇంకెక్కడైనా ఉంటుందా! ప్రజలకి చవగ్గా కరెంటు ఇవ్వాలనుకుంటే తన పవర్ ప్లాంటు నుంచి అంత తక్కువ రేటుకు తెచ్చి ఇవ్వొచ్చు కదా!నా పవర్ ప్లాంటు నుంచి పుట్టే కరెంటుని ఎక్కువ రేట్లకి అమ్ముకుంటూ నేను లాభాలు గడిస్తాను, మీ పవర్ ప్లాంట్ల నుంచి నాకు తక్కువకి ఇచ్చి నష్టపొండి అంటే ఒప్పుకోవడానికి ఆ పవర్ ప్లాంట్ల యజమానులు చెవుల్లో 9 పువ్వులు పెట్టుకున్న ఏపీ ప్రజలు కాదు.

      Delete
  9. అమరావతి తరలిపోతుందని భ్రమపడి ఆందోళనలు చేస్తున్న రైతుల దగ్గిర్నుంచీ దానిని ఆపడం కోసం కోర్టుల ద్వారానూ మండలి ద్వారానూ పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల వరకూ జగన్ వేసిన ఉచ్చులో పీకల్లోతు ఇరుక్కుపోయారని అనిపిస్తున్నది నాకు.

    ఎందుకంటే అమరావతి తరలింపు అనేది మీడియాకు లీక్ చేస్తూ కొన్ని గోబెల్స్ తరహా వార్తల్ని సృష్టించడం తప్ప అధికారికమైన తరలింపు చెయ్యడం లేదు.ప్రతిసారీ ఈసారి ఆ తేదీకి జరగడం ఖాయం అనుకున్న తేదీ వచ్చేసరికి మరో వార్త వస్తున్నదే తప్ప సాంకేతికపరమైన తరలిమొపు ప్రక్రియ అధికారికమైన పద్ధతిలో మొదలు కావడం లేదు.

    అసలు మూడు రాజధానుల ప్రతిపాదన గానీ రాజధాని తరలింపు ఆలోచన గానీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మొదలు కాలేదు.మరి, ఎప్పటినుంచి మొదలైంది?అంతకు ముందు జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏమిటి?

    1.ప్రజావేదికని కూల్చడం,2.పీపీయేల రద్దు, 3.గోదావరిలో బోటు మునగడం, 4.వర్షాకాలం పేరు చెప్పి తవ్వకాల్ని కావాలనే ఆపేసి ఇసుక కొరతని సృష్టించడం వంటివి చాలా జరిగాయి. ఇంకా నిశితంగా పరిశీలిస్తే ఇసుక కొరతని సృష్టించిన తర్వాత తెదెపా నాయకులు దాదాపు ప్రతి రోజూ వైకాపా వాళ్ళు తెలంగాణకు తరలిస్తున్న ఇసుక లారీల్ని పట్టుకుంటూ కేసీయారుకూ జగనుకూ ఉన్న అక్రమసంబంధాన్ని బయటపెట్టడం తారాస్థాయికి చేరిన తర్వాతనే ఈ ఎత్తు వేసింది జగన్ ప్రభుత్వం.

    చంద్రబాబు సభలో అమరావతి గురించి దణ్ణం పెడితే జగన్ వెకిలి నవ్వు నవ్వింది ఎందుకో తెలుసా - చంద్రబాబునీ తెలుగుదేశం నాయకుల్నీ వెర్రివెధవల్ని చెయ్యగలిగాననే ఆనందం అతని ముఖంలో ప్రతిఫలించింది! దీని ఫలితం తిరుపతి లోని సిద్ధేశ్వరుడి కొండని దాదాపు చదును చేసేశారు, దానిమీద పోరాడాల్సినవాళ్ళు అమరావతిని రక్షించుకోవడం కోసం వేరేచోట తిరుగుతున్నారు!


    తెలుగుదేశం నాయకులు కళ్ళు తెరిచి వీలైతే రెండు చోట్లా మొహరించాలి, లేదంటే ఇసుక తరలింపును ఆపడం మీదనే దృష్టిని కేంద్రీకరించాలి.అక్కడ దెబ్బ కొడితే ఆ దెబ్బ ఇక్కడ కూడా పడుతుంది.గెజెట్ ఆర్డరే కాదు, సంతకాలు కూడా లేవు వాళ్ళు అటూ ఇటూ తిప్పుతున్న ఫైళ్ళ మీద - అవే రాజధాని తరలింపు ప్రతిపాదన వెనక తెలుగుదేశం వాళ్ళని ఇసుక రవాణాను పట్టుకునే పనినుంచి డైవర్ట్ చెయ్యటమే వాళ్ళ ఉద్దేశం అనేటందుకు సాక్ష్యాలు.

    ముందు ఇసుక దందాని ఆపండి.

    ReplyDelete
    Replies
    1. నాకు కూడా ఎప్పటినుండో ఇదే సందేహం కలుగుతుంది. ఒక్క రాజధానినే కట్టలేని పరిస్తుతులలో ఉన్న జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు ఎలా సాధ్యం? ఇదేదో ప్రజలను, పోరాడుతున్న టిడిపిని భ్రమలో పెట్టి బ్యాగౌండులో ఏదో చేస్తున్నారు. మీడియాగాని, ప్రజలుగాని, టిడిపి గాని ఆ విషయం ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. ఇసుక మాత్రమే కాదు సర్... ఇంకా ఏదో జరుగుతుంది? ఒకవేళ జగన్ పై ఉన్న ఇంటర్ నేషనల్ కేసుల వ్యవహారం బయటకు రానీయకుండా ఇటువంటి రాద్దాంతాంలు సృస్తిస్తున్నారా?

      Delete
    2. "ఒక్క రాజధానినే కట్టలేని పరిస్తుతులలో ఉన్న జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు ఎలా సాధ్యం?"

      మూడు రాజధానులు అంటే ఏమిటి? సెక్రటేరియట్ విశాఖ, అసెంబ్లీ తుళ్లూరు & హైకోర్టు కర్నూలు. జగన్ కడతానన్నది ఈ మూడు మాత్రమే. చంద్రబాబు వాగ్దానం చేసిన 217 చ.కిమీ. "సింగపూరు తలదన్నే రాజధాని" ఒక్కదానికి ఇటువంటివి బోలెడన్ని కట్టొచ్చు.

      1 huge capital= many small capitals

      Delete
    3. మూడుచోట్లా మూడు గదులను అద్దెకు తీసుకుని కూర్చుని ఇవే మూడు రాజధానులనండి.
      మా రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు చెవులో 9పువ్వులు పెడితే మీరు తెలంగాణలో కూర్చుని 9+9=18 పువ్వులు పెడుతున్నారు ఆంధ్రా జనాలకి.
      రాజధాని ప్రస్తావన వస్తే చాలు తెగ కంగారు పడిపోతున్నారు. ఎందుకో అర్ధం కావడం లేదు. తెలంగాణ పక్షివి మీకెందుకు ఈ ఉబలాటమో..?

      Delete
    4. @AP PoliticsFebruary 22, 2020 at 6:52 PM
      మూడుచోట్లా మూడు గదులను అద్దెకు తీసుకుని కూర్చుని ఇవే మూడు రాజధానులనండి.

      hari.S.babu
      ఇప్పుడు మాత్రం కడతాడా?అద్దె భవనాల మోసం వెతకమని అధికారులకి పురమాయించడం కనపడటం లేదా!కట్టే దమ్ముంటే అద్దె భవనాల కోసం పురమాయింపులు ఎందుకు చేస్తాడు?

      Delete
    5. 2014 నుంచి 2019 వరకు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో మూడవ స్థానంలో నిలబెట్టాడు ఆంధ్రాని చంద్రబాబు.పోనీ అదేమన్నా అందరూ అతనికి సహకరించి జాకీలు పెట్టి లేపారా అంటే ప్రతి అడ్డ గాడిదా ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు సక్సెస్ కాగూడదని పంతం పట్టి ఎదురు నిలబడ్డారు.అన్ని ప్రతికూలతల మధ్యన ఆ మాత్రం సాధించటమే గొప్ప!ఇప్పుడు గానీ అధికారంలో ఉంటే అమరావతీ ఆంధ్రా కూడా ఈ అయిదేళ్ళు పూర్తయ్యేసరికి ఒక ఇంద్రజాలాన్ని ప్రపంచ ప్రజలకి చూపించి వుండేవి!జగన్ పాలన అయిదేళ్ళు పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ నైజీరియా, ఉగాండా లాంటి ఆఫ్రికా కరువు ప్రాంతాల పక్కన నిల్బడటం ఖాయం! అయినా సరే జై అనే లుచ్చా వెధవ ఎన్నికలకి ముందు ఆంధ్రావాళ్ళకి చంద్రబాబు కన్న జగన్ మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తాడని బోడి సలహాలు ఇచ్చాడు!

      మొట్ట మొదటి సారి NTRని పడగొట్టి అధికారంలోకి వచ్చినప్పటినుంచి చంద్రబాబుది ఉపాధి కల్పన విషయంలో రాక్షస పంతం!ఇన్వెస్టర్లకి నమ్మకం కలిగించి తన అధికార పరిధి ఉన్న ప్రాంతంలో పెట్టుబడుల కుంభవృష్టిని కురిపించడంలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అతనికి సరి తూగగలిగిన వ్యక్తి ప్రస్తుత తరపు నాయకుల్లో ఎవడూ లేడు.ఉంటే చూపించమనండి ఈ బడుద్ధాయిని.

      ఈ జైకి తెలంగాణ ప్రాంతీయాభిమానం కూడా లేదు - డార్క్ నైట్ సినిమాలో జోకర్ పాత్ర లాంటివాడు అశాంతీ అరాచకత్వమూ హింసా చెలారెగుతుంటే చూసి పగలబడి నవ్వే పిశాచి. చంద్రబాబులా పరిపాలిస్తే కేసీయారునీ జగన్నీ కూడా ద్వేషిస్తాడు!

      తెలంగాణ పట్ల కూడా ఈ పిశాచికి న్యాయమైన ధోరణి లేదు.జగనులానే కేసీయార్ కూడా 100 రూపాయలు అప్పు తెచ్చి 40 రూపాయలు జనానికి ఇచ్చి 60 రూపాయలు తన మందకి మేపుతున్నాడు.అయినా సరే, ఒక్క మాట కేసీయారుకి వ్యతిరేకంగా మాట్లాడటం ఎవరూ చూడలేదు.ఎందుకంటే, చెప్పాను కదా!

      Delete
    6. @AP PoliticsFebruary 22, 2020 at 2:34 PM
      నాకు కూడా ఎప్పటినుండో ఇదే సందేహం కలుగుతుంది....ఇసుక మాత్రమే కాదు సర్... ఇంకా ఏదో జరుగుతుంది?

      hari.S.babu
      మొన్నటి 2019 ఎన్నికల్లో కొలిచినట్టు జగన్ దగ్గిర్నుంచి లాక్కున్నాడని అంటున్న 23 సంఖ్యయే తెదెపాకి రావడం అనేది ఒక్కటి చాలు జగన్ తెచ్చుకున్న 151 కూడా ఈవీయం మాయాజలం అని చెప్పడానికి.ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లని 50-50% లెక్కించడానికి తిరస్కరించడం మరింత బలమైన సాక్ష్యం!

      లోపాయకారీ వార్తలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మోదీ జగనుతో నీ అసలు సంఖ్య 50 మాత్రమే అని అన్న ముక్క నేనూ చదివాను.ఇలాంటివి నూటికి నూరు శాతం నమ్మవచ్చునా అని అంటే అక్కడ ఆ వార్త తనకెలా తెలిందో అతను చెప్పలేదు ఆనెది మాత్రమే తీసుకుంటే నమ్మలేము.కానీ వార్తా పత్రికలు ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ అజమాయిషీలో ఉంటాయి. మనకి తెలిసేళా పత్రికలో ప్రచ్గురించకపోయినా ఎవరన్నా కేసు వేసి ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ అతన్ని ఆధారాలు చూపించమని అడిగినప్పుడు చూపించకపోతే ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ పత్రిక లైసెన్సును రద్దు చేసే అవకాశం ఉంది.అతనికున్న పాప్యులారిటీని బట్టి కేసునీ ప్రెస్ కౌన్సిలునీ మ్యానేజి చేసే అవకాసం ఉంది గానీ కేసు వేసినవాడు అతన్ని మించినవాడు అయితే - కేసీయారు తొక్కితే ఏం చేశాడు?

      ఎలా గెల్చాడన్నది కాదు కొశ్చ్బెను, గెల్చాక ఏం చేస్తున్నాడన్నది పాయింటు.మొదటి రోజుల్లో అతనికి కేసీయారూ మోదీ జగనుకి విధించిన తక్షణ కర్తవ్యం చంద్రబాబు మళ్ళీ పైకి లేవకుండా 2022లో గానీ 2024లో మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడమని.జగనుకి బుర్రలో గుజ్జు ఉండి ఉంటే అప్పటి రాజశేఖార్ రెడ్డిలా చంద్రబాబు చేసిన మంచి పనుల్ని కొనసాగిస్తూ రాజధాని పనుని కొనసాగిస్తూ CRDA చట్టం ప్రభుత్వానికి అమ్మకపు హక్కుల్ని ఇచ్చిన భూముల్ని పద్ధతి ప్రకారం వాడుకునేలా పరిపాలించి ఉంటే ఇప్పటికి చంద్రబాబు అనామకుడై తెదెపా అంతరించి పోయి ఉండేది!

      కానీ, అతను వేసిన తప్పటడుగుల వల్ల చంద్రబాబు మరింత బలం పుంజుకోవటం మొదలుపెట్టాడు.ఇప్పుడు మోదీ, కేసీయార్, జగన్ త్రయం యొక్క ప్లాను ఒకవేళ మళ్ళీ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటికీ బాగు చెయ్యడానికి వీల్లేని స్థాయిలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించటం.ఆ రాష్ట్ర పౌరులం కాబట్టి వినడానికి కష్టంగా ఉన్నా నమ్మలేనట్టు అనిపించినా ఇది నిజం - జైలాంటి వాళ్ళకి ఎప్పుడో తెలుసు.అతను జగన్ని సమర్ధించడం ఆంధ్ర ప్రాంతం స్మశానం అయ్యాక చూసి పగలబడి నవ్వుకోవాలనే!

      లేకపోతే ఏమిటండీ!పైన కొన్నింటిని గురించి చెప్పాను కదా ఆ అయిదేళ్ళలో తను చేసి చూపించినవి.అభివృద్ధి అనే పదానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. పోలవరం ప్రాజెక్టును 70 శాతం వరకు పనులను గిన్నిస్ బుక్ రికార్డులతో పరుగులెత్తించి, పట్టిసీమను కట్టి రైతులకు నీళ్లు అందించి, శాసనసభ, సచివాలయ భవనం - వెలగపూడి,విద్యుత్ సౌధ భవనం -విజయవాడ, ఏపీ పోలీస్ హెడ్ కోటర్స్ - మంగళగిరి, హైకోర్టు ఆఫ్ ఏపీ - నేలపాడు,ఏపీఐఐసీ భవనం - మంగళగిరి,ఏపీ పోలీస్ టెక్ టవర్స్ - మంగళగిరి,దేవాదాయ భవనం - గొల్లపూడి,కమాండ్ కంట్రోల్ సెంటర్ - వెలగపూడి,ఆర్ అండ్ బి భవనం - విజయవాడ, సుమారుగా 1250 కోట్లు ఖర్చు చేసి కట్టారు. ఇవి కాకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్ టవర్స్, రోడ్లు డ్రైనేజీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 10 వేల కోట్లు ఖర్చు చేసి 70 శాతం నిర్మాణాలు పూర్తి చేశాడు.అయినా ఎందుకు పదవీచ్యుతుణ్ణి చేశారు చంద్రబాబుని?

      Delete

    7. -- అయినా ఎందుకు పదవీచ్యుతుణ్ణి చేశారు చంద్రబాబుని?

      జవాబు - పదవిలో వున్న వాడు పనిలో తలమున్కలై వుంటాడు . పదవిలో లేని వాడు జనాల వాకిట ముందు నిత్యం కనబడుతుంటాడు. సో, ఐదేళ్ళలో మన జనాలు చూసే వాణ్నే బెటరనుకుంటారు దారి వేసే వాని కన్నా .

      చర్విత చర్వణము :)



      జిలేబి

      Delete
    8. విన్నకోటవారూ,
      జిలేబీ మాత వచనభాగ్యం ప్రసాదించారు చూ"షా"రా ?

      Delete
    9. అవునండోయ్. మీరు చెప్పిన తర్వాత ఇప్పుడే చూ”షా”ను 🙂.
      ఈ రోజెంతటి సుదినం!
      థాంక్స్ నీహారిక గారూ.

      Delete

    10. ఏమి "షు" ది నమో ! మార్కెటు‌ డమా‌లే డమాలు :)


      చూషా చూషా నండీ
      వాషయెనుగ మార్కెటు యిక పద్యము కట్టం
      గా" షమయ" మెక్కడయ్య ప
      రేషానె సుమీ మిగిలె పరేషానె సుమీ :)


      Delete
    11. అయినా బాధపడడానికి కూడా పద్యాన్నే ఎంచుకున్నారుగా. మీరండీ నికార్సైన కవులు 👏🙂.

      Delete
  10. This comment has been removed by the author.

    ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.