Showing posts with label Editorials. Show all posts
Showing posts with label Editorials. Show all posts

Monday, March 14, 2022

AP Telugu Political News | ప్రజలలో విజ్ఞత పెరగాలి. ఆలోచనా విధానం మారాలి. | AP Political Reviews

AP Telugu Political News

 AP Telugu Political News: ఆంధ్రాలో రాజకీయాల ముఖచిత్రమే మారిపోయింది. ఇక్కడ ప్రజల అభిప్రాయాలకు, స్వేచ్చకు ఏమాత్రం విలువ లేదు. రాష్ట్రానికి ఒక రాజధాని ఉంచి అక్కడ నుండి రాష్ట్రం అంతా అభివృద్ధి చేయవచ్చు. అంతేగాని మూడు రాజధానులు కడతాం. ముప్పై రాజధానులు కడతాం.. ఇలాగే అభివృద్ధి సాధ్యం అనేది ఏవిధమైన వాదనో ఎవరికీ అర్ధం కావడం లేదు. 

మూడు రాజధానుల సిద్ధాంతం భవిష్యత్ లో మూడు రాష్ట్రాలుగా విడిపోవడానికి ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇక ఆంధ్రా పరిస్థితి అగమ్య గోచరంలానే తోస్తుంది. ఆంధ్రాను ఏకంగా ఉంచే ఆలోచన నేటి ప్రభుత్వానికి ఉన్నట్లు అనిపించడం లేదు. హీరో శివాజీ అన్నట్లుగా రాబోయే రోజుల్లో ప్రతి ఆంధ్రుడు ఇతర రాష్ట్రాలకు పోయి బ్రతికే పరిస్థితి వస్తుంది.

Friday, October 30, 2020

If journalism is sold for money, is it not the beginning of the downfall of the country? | జర్నలిజం డబ్బులకు అమ్ముడైపోతే దేశ పతనానికి నాంది కాదా? ( Editorials)

 If journalism is sold for money, is it not the beginning of the downfall of the country? | జర్నలిజం డబ్బులకు అమ్ముడైపోతే దేశ పతనానికి నాంది కాదా?

If journalism is sold for money
నేటి జర్నలిజం గురించి, అత్యధిక మేధావుల మీడియా సమావేశాల గురించి మనం తరచూ చూస్తూ ఉన్నాం. ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ చివరికి ప్రజల చెవుల్లో దుష్ ప్రచారం మ్రోగిస్తూ దేశాన్ని ఆయా రాష్ట్రాలను సర్వనాశనం చేస్తున్నారు.

మీడియా ఎప్పుడూ ప్రతిపక్ష హోదాలోనే ఉండాలి. అధికార పక్షానికి లోబడితే ప్రజల తరుపున బలంగా నిలబడేది ఎవరు?

మేధావుల ముసుగులో ఉన్న వారు మరీ దారుణం. వీళ్ళు ప్రజలకు ఏదో ఉద్దరిస్తున్నామన్న బిల్డప్ ఇస్తూ తెగ సమావేశాలు పెడతారు. కానీ వీళ్ళ మనస్సుల్లో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, స్వార్ధాలు చాలా భయంకరమైనవి. వీళ్ళు ప్రజలను ఏమార్చే తీరు అత్యంత దారుణమైనది. వీళ్ళు ఏపార్టీ అయినా లోకువుగా కనిపిస్తే ఎటువంటి అభాండాలు వేయడానికైనా వెనుకాడరు.