Showing posts with label Latest Telugu news. Show all posts
Showing posts with label Latest Telugu news. Show all posts

Thursday, February 16, 2023

TDP Anitha Sensational Comments On Minister Roja & CM Jagan | రోజాని ఆంబోతులా ఆంధ్రాపై వదిలేసిన జగన్

 TDP Anitha Sensational Comments On Minister Roja & CM Jagan | రోజాని ఆంబోతులా ఆంధ్రాపై వదిలేసిన జగన్

Monday, November 15, 2021

Judge Ramakrishna Shocking Comments On YS Viveka Case | వివేకాను హత్య చేసింది జగన్

 Judge Ramakrishna Shocking Comments On YS Viveka Case | వివేకాను హత్య చేసింది జగన్

Tuesday, October 13, 2020

tdp leaders talk about ys jagan new scams | జగనన్న జేబు కత్తెర పధకం -YCP నాయకులకు కొత్త పథకం

 

tdp leaders talk about ys jagan new scams | జగనన్న జేబు కత్తెర పధకం -YCP నాయకులకు కొత్త పథకం

ys jagan,tdp leaders,cm ys jagan,war of words between ys jagan and tdp leaders,ys jagan mohan reddy,tdp,ys jagan reveal tdp leaders assets in new,ys jagan reveal tdp leaders assets in new capital city,ys jagan vs tdp leaders,ys jagan reveal tdp leaders,ys jagan statements on tdp leaders,ys jagan reveal tdp leaders assets,ys jagan treats tdp leaders as dogs,ys jagan comments on tdp leaders,ap cm ys jagan,tdp leader pattabhi comments cm ys jagan,ys jagan speech

Tuesday, July 21, 2020

Latest Telugu news : వల్లభనేని వంశీ పని ఇక అయిపోయినట్లేనా?

Latest Telugu news : వల్లభనేని వంశీ పని ఇక అయిపోయినట్లేనా? 

Latest-Telugu-news-One-More-Jolt-To-Mla-Vallabhaneni-Vamsi
వల్లభనేని వంశీ పని ఇక అయిపోయినట్లేనా? 
ఆదరించిన నాయకుడిని అభిమానించటం మాని అణగదొక్కాలని చూసేవారికి వల్లభనేని వంశీ ఉదాంతం ఒక ఉదాహరణ. టిడిపిని వదిలేసిన కనీసం ఆదరించిన నాయకుడైన చంద్రబాబు పట్ల గౌరవంతో ఉన్నా సరిపోయేది కానీ... వైసిపి మన్ననలు పొందటం కోసం జగన్ ను ఆకాశానికి ఎత్తుతూ చంద్రబాబు పట్ల అనేక దుర్భాషాలాడుతూ విర్రవీగాడు. గన్నవరంలో తనేదో వైసీపీ తరుపున చక్రం తిప్పుదామని కలలు కన్నాడు. కానీ అంతలోనే అతని కలలన్నీ పటాపంచలు చేస్తూ... గన్నవరంలో ఒకప్పుడు వెలుగువెలిగి రాజకీయంగా తెరమరుగైన వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రాంచంద్రరావు వర్గం రంగప్రవేశం చేసింది. వల్లభనేని వంశీకి ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న విషయం వైసీపీలో చేరాకే అర్థమవుతోందని గన్నవరంలో అతని అనుచరులు సైతం గుసగుసలు ఆడుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబును ఎదురించి వైసీపీ అధినేత జగన్ ను జైకొట్టిన వంశీకి లైన్ క్లియర్ చేసింది వైసీపీ అధిష్టానం అని అందరూ అనుకున్నారు.. గత ఎన్నికల్లో వంశీ చేతిలో ఓడిన వైసీపీ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావుకు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని కట్టబెట్టి వంశీకి ఇక పోటీ లేదు అన్న భావన కలిగించింది. దీంతో గన్నవరంలో యార్లగడ్ద జెండా పీకేశారు.

ఇదే ఆనందంలో ఉన్న వల్లభనేని వంశీకి ఇప్పుడు ఆ సంతోషం మాయమయ్యిపోయింది.  వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రాంచంద్రరావు వర్గం ఇప్పుడు మరోసారి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దుట్టా అల్లుడు వైసీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివభరత్ రెడ్డి హైదరాబాద్ నుంచి డాక్టర్ వృత్తిని పక్కనపెట్టి గన్నవరంకు వచ్చేశారు. వైసీపీ గెలవడంతో పూర్తి స్థాయి గన్నవరం రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ఇప్పుడు వల్లభనేని వంశీకి రాజకీయ భవిష్యత్ కు బీటలు పడటం ప్రారంభమయ్యింది. దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి సీఎం జగన్ కు స్వయానా బంధువు కావడంతో.. అదీ కాకుండా రెడ్డి సామాజిక వర్గం ఒకటి కావడంతో దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డికి గన్నవరంలో ఎదురు లేకుండా పోయింది. దీంతో తాజాగా వంశీ వర్సెస్ శివభరత్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ముదిరాయి. వైఎస్ జయంతి సందర్భంగా ఇద్దరూ వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించి ఘర్షణలు చేసుకున్నారు.. రెండు వర్గాలు బాహాబాహీకి గన్నవరంలో దిగడంతో ఉద్రిక్తంగా మారింది.