Monday, December 30, 2019

Did Jagan Reddy know the actual administration? | జగన్ రెడ్డికి అసలు పరిపాలన తెలుసా?

Did Jagan Reddy know the actual administration? | జగన్ రెడ్డికి అసలు పరిపాలన తెలుసా?
ys jagan mohan reddy,jagan mohan reddy,jagan mohan reddy news,ys jagan,jagan,ap cm jagan,ap cm jagan mohan reddy,ap cm ys jagan mohan reddy,ys jagan mohan reddy administration,jagan mohan reddy celebrations,ys jagan mohan reddy about pawan,ys jagan mohan reddy swearing in ceremony,jagan mohan reddy wins,jagan mohan reddy latest interview,jagan mohan reddy latest,ys jagan speech


15 comments:

  1. ఈ బ్లాగు కేవలం జగన్ మీద విషం కక్కడానికే పెట్టినట్టు అనిపిస్తుంది. అదివరకు చాకిరేవు అనే బ్లాగు ఇదే పని చేసేవాడు. ఎందుకు బ్రదర్ ఈ వెర్రి ద్వేషం. కులపిచ్చి తో కొట్టుకు చావడం వల్లే ఆంధ్ర లో ఈ రోజు ఈ గతి పట్టింది మనకు.

    విమర్శించ వద్దని ఎవ్వరూ అనరు. కక్షలో మునిగి తేలుతూ విషం చిమ్మడం మంచిది కాదు.

    ఒక్క సారి ఆలోచించు. రాధాకృష్ణ, రామోజీ, బాబు.. ఇంకా ఈ సామాజిక వర్గం వారిని ఎందుకు ప్రజలు తిరస్కరించారు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో.

    జగన్ తప్పులు చేస్తే ప్రజలు తగిన విధంగా తీర్పు ఇస్తారు. ప్రజా కోర్టు లో ఎవరైనా సమానమే.

    ఈ కుల విద్వేష వాతావరణం వ్యాప్తి చేయవద్దు.

    ReplyDelete
    Replies
    1. "ఈ బ్లాగు కేవలం జగన్ మీద విషం కక్కడానికే పెట్టినట్టు అనిపిస్తుంది."
      లేదు బుచికి గారూ! ఈ బ్లాగు ప్రజాపక్షం. ఎవరినైనా విమర్శిస్తుంది. ఏదో పార్టీని మోయాల్సిన ఖర్మ ఈ బ్లాగుకు లేదు. పై వీడియోలో కేవలం జగన్ ను మాత్రమే విమర్శించలేదు. చంద్రబాబును కూడా విమర్శించినట్లు ఉందికదా? అంతే కాదు మొదటిలో అమరావతికి అన్యాయం చేసిన పవన్ ను కూడా ఎండగట్టిన వీడియోలున్నాయి.అలాగే
      కొన్ని మంచి పనులను చేసిన జగన్ ను,చంద్రబాబును,పవన్ కళ్యాణ్ గార్లను కూడా అభినందించిన విషయాలున్నాయి సర్. ఆంధ్రాకు అన్యాయం చేసిన ప్రతివారిని ఈ బ్లాగు వ్యతిరేకిస్తుం.ది. ఎవరి పక్షపాతి కాదు.

      Delete
    2. అస్సలు "జనాలు ఓట్లు నాచబానాకే వేస్తే, ఈవీఎం లు మానేజ్ చేసి గెలిచారు" అని ఈడ నమ్ముతుంటే, ఈ క్లాసులవసరమా బుచికిగారూ! మీరు కూడా నాలాగే, ఈ బ్లాగులో పా...త .. పఒష్టూలు చూసుకుంటూ ఇప్పటికి జగన్ ఎన్నిసార్లు జైలుకెల్లారో, మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు ఒచ్చిందో, జగన్ పార్టీ ఎన్ని వందల సీట్లు తేడాతో వోడిపోయిన్నందో.. లాంటి కుండపెంకులు చూస్తూ ఎంజాయ్ చేసెయ్యండి.. బహు కామెడీగా వుంటాయి..

      Delete
    3. నువ్వు ఓడిపోవడం ఏందయ్యా ఎపిసోడ్ తరువాత మళ్ళీ అంత గొప్ప కామెడీ సీన్ మొదలయింది. ఆపిల్ వాచీలు వేసుకొని మరీ దీక్షలు చేసే కులకాంతలకు మద్దతుగా ప్లాటినం గాజుల త్యాగం. "మా భీ కభీ భేటీ బహూ థీ" సీరియల్ విరామం లేకుండా ఎవరి సౌజన్యంతో ఎన్నేళ్లు ఆడుతుందో "హం భీ దేఖేంగే".

      Delete
    4. రాయలసీమ అల్లుడు ఎన్ని ఎకరాలు లాండ్ పూలింగ్ కి ఇచ్చేత్తాడో హం"భీ దేఖేంగే" !

      Delete
    5. సెంటు భూమి లేనోడు ఎంతిస్తాడు మేడం?

      స్విమ్మింగ్ పూలు బానే ఉంటుంది, ఈ భూమిపూలు ఏమిటో ఏమో. అక్కడికి ఏమో పున్నానికి ఇచ్చినట్టు బిల్డప్పులు ఒకటి. లక్షలు చేసే భూమి విలువ కోట్లకు చేరాలనే అత్యాస కాకుంటే ఇంకేంది?

      Co-development అన్నాక రిస్కులు కూడా ఉంటాయి. బిల్డర్ తాత ముల్లేమిబాయె, ఘటోత్కచుడి లెవెల్లో ఏవేవో కహానీలు చెప్తాడు. అన్నిటికీ కండిషన్స్ అప్లై అని డిస్క్లైమర్ కూడా ఉంటుంది.

      Delete
    6. ఇటీవల ఓషో ఉపన్యాసం ఒకటి వింటే... సంపన్నులను విమర్శించే వారికి సున్నితంగా ఆయన ఇచ్చిన సమాధానం అద్భుతం అనిపించింది.
      ఇలాంటి వాదనకు బహుశా ఇంత చక్కని సమాధానం ఇప్పటి వరకు ఎవరూ ఇచ్చి ఉండరు.
      ఓషో ఉపన్యాసం ఇస్తుండగా, ఒకరు ప్రశ్న రాసి పంపించారు. దేశంలో ఎంతో మంది పేదలు ఉండగా, మీరు రోల్స్ రాయిస్ కార్లలో తిరగడం ఎందుకు? ఆ డబ్బును పేదలకు పంచవచ్చు కదా? అని ప్రశ్నించారు.
      ఆయన సమాధానం ఇలా సాగింది...
      ‘‘దేశంలో 70కోట్ల మంది డబ్బు అవసరం ఉన్న పేదలు ఉన్నారు. నేను కారు అమ్మితే ఎంత మందికి ఇవ్వగలను. సరే మీరు ముందుకు వచ్చారు సంతోషం. నీ వాటాగా ఓ పైసా వస్తుంది. వచ్చి తీసుకో. మిగిలిన పేదవారు వచ్చినప్పుడు తలా ఓ పైసా ఇస్తాను. చిత్రమేమంటే నేను కారులో కాకుండా నడుస్తూ వెళ్లినప్పుడు కూడా దేశంలో ఇంత మంది పేదలే ఉన్నారు. నన్ను ప్రశ్నించిన వారిని అడుగుతున్నాను. పేదలకు మీరేం ఇచ్చారు. మీ సైకిల్ అమ్మి పేదలకు ఇచ్చారా? మీ ఇళ్లు అమ్మి ఇచ్చారా? మీ షాప్ అమ్మి ఇచ్చారా? ఎందుకివ్వడం లేదు. అవసరం అయిన పేదలు ఎంతో మంది ఉన్నారు. కదా? వారిని మీరు ఆదుకోరా! డబ్బు అవసరం అయిన పేదవారికి ఏం చేశారు. సంపన్నులను పేదలకు సంపద ఇచ్చేయాలి? మరి ఇంతకూ పేదలేం చేయాలి. మరి పేదలు ఏం చేయాలి? మరింత మంది పేదలను పుట్టించడమే వారి పని అంతే కదా?
      డబ్బు సంపాదించిన వారు పేదల గురించి ఆలోచిస్తే మరి పేదలేం చేయాలి?

      Written by Mr. Buddha Murali garu.

      Delete
    7. అస్సలు ఒకడు దానం చెయ్యాలని.. ఇంకొకడు డిమాండ్ చెయ్యడమేంటి?

      Delete
    8. రజనీష్ బాబా చనిపోయి 30 ఏళ్ళయిందనుకుంటా. ఇప్పుడంతా నిత్యానంద సాములోరి హవా.

      Delete
    9. నీహారిక గారూ! ఒకరు చెప్పకపోయినా, చెయ్యకపోయినా... ఇలాంటీ కథలు వాళ్ళ పేర్లమీద బాగా పుట్టిస్తారు. ఎలాగంటే.. వివేకానందుడు "ఏసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు" అని చెప్పాడని సాంఘీక మాధ్యమాల్లో తిప్పుతున్నట్టు..

      Delete
    10. @ chiru dreams,

      ఈ కధ ఆయన చెప్పారో లేదో తెలియదు కానీ మీరు చెప్పిన స్వామీజీ తో సహా అందరూ రోల్స్ రాయిస్ కార్లలో తిరుగుతారు అన్నది నిజం. వాళ్ళకి ఆ కార్లు ఇచ్చినవాళ్ళే దానం చేయమని అడుగుతున్నారు. ఇది ఎందుకు పోస్ట్ చేసానంటే చంద్రబాబుగారిని, ఆయనని సపోర్ట్ చేసినవారిని భూస్వాములు అంటుంటే సెంటు భూమి లేనివాళ్ళు కూడా ఆ పేదవాళ్ళలాగే ఆలోచిస్తున్నారని అనిపించింది.

      ఒక నాయకుడు పిలుపునిస్తే 33 వేల ఎకరాలు (లాభాపేక్షతో ఇచ్చినా సరే) రాజధానికి ఇవ్వడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో చంద్రబాబుగారు గొప్పగా కనిపిస్తున్నారు. 33వేల ఎకరాలు ఎందుకూ అని అనేవాళ్ళకు ఒకటే సమాధానం రమాప్రభ ఇల్లు ఒక ఎకరం ఉంటుంది.
      (ప్రతి నెలా ఎవరో ఆర్ధిక సహాయం చేస్తున్నారనుకోండి. ఇల్లు అన్నం పెట్టదు, అమ్ముకోనూలేరు.)

      Note: నేను పక్కా కాంగ్రెస్ వాదిని. ఇందిర అభిమానిని.

      Delete
  2. South Africa Capitals :

    Pretoria (executive)
    Bloemfontein (judicial)
    Cape Town (legislative)
    ___________

    ఇంత దరిద్రమైన వాయిస్ షేర్ చేస్తున్నారు. మూడు రాజధానులు ఎందుకు అవసరం లేదో ఒక్క ముక్క చెప్పలేదు. శ్యామలీయం గారు చెప్పినట్లు పచ్చ మీడియా అని వ్యాఖ్యానించేవాళ్ళు పిచ్చి మీడియా మాత్రమే. చంద్రబాబుగారిని సమర్ధిస్తే కులాన్ని సమర్ధించినట్లు భావించేవారిని ఏమనుకోవాలి ? విషయం మీద మాట్లాడకుండా అనవసర ప్రేలాపనలు వ్యర్ధం.

    ReplyDelete
  3. ఎవరు ఎవర్ని సమర్థిస్తారో ఎవరికి వారు తేల్చుకోవాలి గానీ అమరావతి సమస్య గురించి “ధ్వంసమవుతున్న కల” అనే ఒక మనోవేదన ఈ క్రింది లింకులో చదవచ్చు.

    https://idinaaprapancham.blogspot.com/2020/01/blog-post.html?m=1

    ReplyDelete
    Replies
    1. బ్లాగరు అనురాధ గారు (అలాగే శ్యామలీయం మాస్టారు ప్రస్తావించిన వనజ గారు కూడా) కొన్ని వాదనలు విన్పించారు. ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి ప్రయోజనాలు వారివి కనుక ఆక్షేపణ లేదు.

      గత ప్రభుత్వం ఆయా గ్రామాల భూస్వాములతో చేసుకున్న భూ-ఒప్పందాలు చెల్లుబాటులోనే ఉన్నాయన్నది వాస్తవం. సదరు ఒప్పందాలకు లోబడే ఏ చర్యయినా తీసుకోవాలి తప్ప ఉల్లంఘించరాదని పట్టు పట్టడం వరకు నేనూ సమర్థిస్తాను.

      Delete
    2. నరసింహారావు గారూ,

      జగన్ గారు కూడా అమరావతి రాజధాని గా తీసివేస్తాననడం లేదు. సౌత్ ఆఫ్రికా మాదిరిగా మూడు రాజధానులుగా చేయవచ్చు అని అన్నారు. ఇందువల్ల వచ్చిన నష్టం ఏమిటో చెబితే చదవాలని ఉంది.

      జగన్ గారిని ఈ విషయంలో నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నన్ను కూడా జైలుకి పంపేటట్లు ఉన్నారు జై గారు.

      చంద్రబాబు గారిని సపోర్ట్ చేస్తే భూస్వాములా ? శ్యామలీయం గారూ కాపాడండి.

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.